మధుబాబుకు డిప్యూటీ సీఎం సత్కారం..
Ens Balu
1
Srikakulam
2020-09-05 18:27:55
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి అవార్డు స్వీకరించిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఏ. మధు బాబును శనివారం కలెక్టరేట్ లో శాలువాతో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సన్మానించారు. ఈసారి రాష్ట్రం నుంచి జాతీయ అవార్డుకు ఎంపికైన ఏకైక ఉపాధ్యాయునిగా మధుబాబు నిలవడం పట్ల మంత్రి మధుబాబుకు అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, జిల్లా పేరును జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఇదే స్పూర్తితో మరింత మంది విద్యార్ధులను మంచి ఉన్నత విద్యార్ధులుగా తయారు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలు కల్పించినందున ప్రభుత్వ పాఠశాలలంటే పిల్లల్లో మంచి భావన కలిగే ఉపాధ్యాయులు తయారు చేయాల్సి వుందన్నారు. మధుబాబు జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసారని కితాబిచ్చారు.