కడపజిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలోని శ్రీ సీతమ్మవారికి కర్నూల్కు చెందిన సి.పుల్లారెడ్డి బుధవారం ఉదయం రూ.1.85 లక్షల విలువ గల 38.042 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. దానికి ఆలయ ఈఓకి అందజేశారు. శ్రీ సీతమ్మవారికి కానుక ఇవ్వాలని ముందుగా అనుకున్నామని దానిని ఇపుడు సమర్పించామని దాతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.