రూ.115 కోట్ల ఉపాది పనులు మంజూరు:పీఓ


Ens Balu
3
2020-06-25 19:59:48

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకంలో చేపట్టిన నిర్మాణపు పనులు లక్ష్యాలను సాధించాలని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. గురువారం ఆయన కార్యాలయంలో పంచాయతీ రాజ్,గిరిజన సంక్షేమ శాఖ, ఎస్ ఎం ఐ ,ఉపాధిహామీ అధికారులతో ఉపాధిహామీ నిదులతో చేపట్టిన పనులపై సమీక్షించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.100 కోట్లు,గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.100 కోట్లు, ఎస్ ఎం ఐ రూ.16 కోట్లు విలువైన పనులు పూర్తి చేయాలన్నారు రైతుభోరోసా కేంద్రాలు, సచివాలయం భవన నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో పి.ఆర్. ఈ ఈ కుసుమభాస్కర్, గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ లు కుమార్,మురళి, ఎపిడి లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.