నవంబర్ 8న ప్రతిభకు ప్రోత్సాహం.. విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు
Ens Balu
3
డాబాగార్డెన్స్
2020-09-08 22:19:40
వైజగ్ జర్నలిస్టుల ఫోరం ప్రతి ఏటా ప్రతిష్టాతకంగా నిర్వహించే ప్రతిభకు ప్రోత్సాహం, మీడియా అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కోవిడ్19ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 8కి మార్పు చేసినట్టు విజెఎఫ్ అధ్యక్ష, , కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, సోడిశెట్టి దుర్గారావులు తెలియజేశారు. విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ, ప్రతిఏటా జర్నలిస్టుల పిల్లలను విద్యారంగంలో ప్రోత్సహిస్తూ జాన్ తొలివారంలో స్కాలర్ షిప్ లు కార్యక్రమం నిర్వహిం చేవారమని, కోవిడ్ నేపధ్యంలో దీనిని నవంబర్ ఎనిమిదవ తేదికి వాయిదా వేశామన్నారు. పాఠశాలల్లో మార్కుల జాబితాను (అర్ధిక సంవత్సరం పరీక్ష ఫలితాలు) తీసుకుని రెండు పాస్ పోర్టుపోటోలను జతచేసి ఈనెలాఖరులోగా డాబాగార్డ్స్ ప్రెస్ క్లబ్ లో అందజేయాలన్నారు. ఇతర వివరాలు కోసం స్కాలర్ షిప్స్ కమిటి చైర్మన్, ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును సంప్రదించాలన్నారు. అవార్డుల కమిటీ చైర్మన్ ఆర్.నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ, సబ్ ఎడిటర్, వీడియో ఫోటో జర్నలిస్టులు క్రీడా, క్రైమ్, చిన్న పత్రికలకు సంబందించిన సంఘాలు వారే ఇద్దరు ప్రతినిధులను ఎంపిక చేసిన పేర్లను లెటర్ హెడ్ పై బయోడేటాలతో విజెఎఫ్ కార్యాలయం లో అంద జేయాలన్నారు ఆకర్షణీయ సాంస్కృతిక ప్రదర్శనలు, లక్కీడిప్ వంటి ప్రత్యేకత లతో ఈ కార్యమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రతిభకు ప్రోత్సహాం కో - చైర్మన్ లు టి నానాజీ, పి.ఎన్.మూర్తి , దాడి రవికుమార్ కార్యవర్గ ప్రతినిధులు ఇరోతి ఈశ్వరరావు, ఎం ఎస్ ఆర్.ప్రసాద్, పి.వరలక్ష్మీ ,పి.దివాకర్, దొండాగిరిబాబు, కె.ఆర్ శేఖర్ మంత్రి , గయాజ్, డేవిడ్ రాజు, మాధవ్ తదితరులి పాల్గొన్నారు.