15నుంచి ఆగ్రిమార్కెటింగ్ లో ఈ-పర్మిట్లు..


Ens Balu
3
Kakinada
2021-09-03 09:36:54

తూర్పుగోదావరి జిల్లాలో సెప్టెంబరు 15 నుంచి వ్యవసాయాధారిత వ్యాపారాలకు సంబంధించి ఈ-పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఈ మేరకు కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వ్యాపారస్తులను సాధారణ పద్దతిలో అనుమతులు మంజూరు చేసేవారమని, ఇక నుంచి ఆన్ లైన్ ద్వారా పర్మిట్లు మంజూరు చేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. తద్వారా వ్యాపారస్తులకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని 22 మార్కెట్ కమిటీలకు సమాచారం అందించినట్టు ఏడి  ఆ ప్రకటనలో తెలియజేశారు.