లైంగిక వేధింపులెదురైతే ఫిర్యాదు చేయండి..


Ens Balu
3
Visakhapatnam
2021-09-03 10:06:40

మహిళా ఉద్యోగిణిలు, సిబ్బంది పనిచే చోట లైంగిక వేధింపులకు గురైతే కచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) దృష్టికి తీసుకురావాలని న్యాయవాది సామాజిక వేత్త రహీమున్నీసాబేగమ్ కోరారు. విశాఖలో శుక్రవారం  కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో జరిగిన  ప్రత్యేక సమావేశంలో ఆమె ఎథిక్స్ /పోష్ కమిటీలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా  పలు కీలక అంశాలపై చర్చించారు. మహిళా ఉద్యోగులు పనిచేసే చోట ఏవిధంగా ఉండాలో, ఉండకూడదో కూడా అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళలు ఎవరూ అభద్రతా భావంతో ఉందొద్ధని చట్టం,న్యాయం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. న్యాయపరంగా మహిళా ఉద్యోగులకు అండగా ఉండే పలు అంశాలను కూడా అక్కడి ఉద్యోగినులకు తెలియజేశారు. ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్) పైనా చర్చించి మహిళల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు.