పోర్టిఫైడ్ బియ్యంపై అపోహలు పెట్టుకోవద్దు..


Ens Balu
4
Kakinada
2021-09-05 08:13:09

ప్రభుత్వం పంపిణీ చేసే పోర్టిఫైడ్ బియ్యంపై ప్లాస్టిక్ బియ్యం అనే అపోహను వీడాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని మీడియాతో ఆయన ఆదివారం జూమ్ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. పోషకాలు నేరుగా బియ్యంతో కలిపి అందించాలనే ఉద్దేశ్యంతో బియ్యానికే పోషకాలను కలిపి అంస్తున్నదన్నారు. ఆ బియ్యాన్ని కడిగే టపుడు ముందు తేలిపోతాయని, ఆ సమయంలో చాలా మంది వీటిని ప్లాస్టిక్ బియ్యంగా అనుకొని పాడేస్తున్నారని అన్నారు. అలాకాకుండా రెండు మూడు సార్లు కడిగితే బియ్యం సాధారణంగా ఉంటాయన్నారు. ప్రజలు అపోహలు వీడి ఎంతో విలువైన పోషకాలున్న పోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించాలని, ఈ విషయంలో ప్రజలు చైతన్యం అయ్యేలా మీడియా సహకరించాలని జెసి కోరారు.