ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఏయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలకు ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి పూలమాల వేసి వివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ దార్శినికతతో పనిచేసారని, విశ్వవిద్యాలయం అభ్యున్నతికి పూర్తిస్తాయిలో పనిచేసారని గుర్తుచేసుకున్నారు. ఆయన సేవలను విశ్వవిద్యాలయం చిరస్థాయిగా గుర్తుంచుకుంటుందన్నారు.
కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.శ్రీనివాస రావు, పేరి శ్రీనివాస్, పి.రాజేంద్ర కర్మార్కర్, ఎస్.సుమిత్ర, కె.విశ్వేశ్వర రావు, వై.రాజేంద్ర ప్రసాద్, పాల కమండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, క్రిష్ణమంజరి పవార్ డీన్ ఆచార్య టి.షారోన్ రాజు, ఎన్.ఏ.డి పాల్, డాక్టర్ హెచ్.పురుషోత్తం, పేటేటి ప్రేమానందం, సిఎస్ఓ మహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.