తూ.గో. 55ఆర్బీకేలు నిర్మాణాలు పూర్తి..


Ens Balu
3
Kakinada
2021-09-07 03:22:22

తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకూ 55 రైతేభరోసా కేంద్రాలు నిర్మాణం పూర్తైందని వ్యవసాయశాఖ జాయింట్ డైక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. మంగళవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జిల్లాకు 1204 రైతుభరోసాకేంద్రాలను మంజూరుచేసిందన్నారు. వాటిలో 720 నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. డిసెంబరు నాటికి మొత్తం ఆర్బీకేల నిర్మాణాలు పూర్తికానున్నాయని, నిర్మాణాలు వేగం పుంజుకున్నాయని ఆయన వివరించారు.