తూ.గో. 16 పశువైద్యుల పోస్టులు ఖాళీలు..


Ens Balu
3
Kakinada
2021-09-07 03:27:27

తూర్పుగోదావరి జిల్లాలో 16 పశు వైద్యుల పోస్టులు ఖాళీలు ఉన్నట్టు పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డా.ఎస్.సూర్యప్రకాశరావు తెలియజేశారు. మంగళవారం ఆయన కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 64 మండలాల పరిధిలో పశువైద్యలు లేని చోట ఉన్నవైద్యులకే అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. వారికి సహాయంగా గ్రామీణ పశువైద్య సహాయకులు పనిచేస్తున్నారని చెప్పారు. గతంలో కంటే ఇపుడు పశువైద్యం పూర్తిస్థాయిలో మెరుగు పడిందని, మందులు కూడా కూడా లభ్యం అవుతున్నాయన్నారు. పాడి రైతులు తమ పశువుల కోసం ఏ విధమైన సహాయమైనా రైతుభరోసా కేంద్రాలు,  వెటర్నరీ డిస్పెన్సరీల ద్వారా పొందవచ్చునని ఆయన సూచించారు.