ద్యానవన పంటలకు 40% ఈ-క్రాప్ బుకింగ్..


Ens Balu
3
Kakinada
2021-09-07 05:47:07

తూర్పుగోదావరిజిల్లాలో ఉద్యాన వన పంటలకు ఈ-క్రాపింగ్ ఇప్పటి వరకూ 40శాతం పూర్తయినట్టు డిప్యూటీ డైరెక్టర్ రమ్మోహన్ తెలియజేశారు. మంగళవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండలాల్లో ఉద్యానవన పంటలు 4లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామ సచివాలయాల పరిధిలోని గ్రామీణ ఉద్యాన సహాయకులు ఈ-క్రాపింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈనెలాఖరు నాటికి ఈ క్రాపింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయని డిడి వివరించారు.