కాణిపాక వినాయకుడికి హైకోర్టు చీఫ్ జస్టిస్ పూజలు..


Ens Balu
4
Kanipakam
2021-09-12 10:54:14

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దంపతులు కాణిపాకం లోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకున్నారు. శ్రీ స్వామి వారి దర్శనానికి వచ్చిన  వీరికి  వేద పండితులు స్వాగతం పలికి స్వామి వారి దర్శన ఏర్పాట్లను  కార్యనిర్వహణాధికారి  ఎ.వెంకటేశు చేయించారు.అనంతరం వారికి వేదపండితుల ఆశీర్వచనముతో శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలను,స్వామి వారి చిత్ర పఠమును అందచేశారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు గారు, డి.ఎస్.పి సుధాకర్ రెడ్డి, ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, ఐరాల ఎమ్మార్వో, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు