తూ.గో.జి.లో 2950 ఎకరాల్లో సెరీకల్చర్ సాగు..
Ens Balu
3
Kakinada
2021-09-13 05:07:05
తూర్పుగోదావరి జిల్లాలో 2950 ఎకరాల్లో సెరీకల్చర్ సాగుచేపడుతున్నట్టు సెరీకల్చర్ డెప్యూటీ డైరెక్టర్ బిఎంవీ రామరాజు తెలియజేశారు. సోమవారం కాకినాడ తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పట్టుపరిశ్రమను అభివ్రుద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం నియమించిన 11 మంది(ఒక్క పోస్టు భర్తీకాలేదు) విలేజ్ సెరీ కల్చర్ సిబ్బంది రైతులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. సాగు వీస్తీర్ణం పెంచేందుకు అన్ని రకాలు చర్యలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సాగు చేస్తున్నవారికి ప్రభుత్వం నుంచి అన్నిరకాల రాయితీలు, పథకాలు వర్తింపజేస్తున్నామని సెరీకల్చర్ డిడి వివరిస్తున్నారు.