తూ.గో.జి.లో 38వేల ఎకరాల్లో బిందుసేద్యం..


Ens Balu
3
Kakinada
2021-09-13 06:15:07

తూర్పుగోదావరి జిల్లాలో 38వేల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం చేపడుతున్నట్టు ఏపీఎంఐపీ పీడి డా.రామ్మోహన్ తెలియజేశారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 30వేల మంది రైతులకు ఈ ప్రాజెక్టును దగ్గర చేశామన్నారు. అన్ని రకాల పంటలకు ఈ సేద్యాన్ని రైతులకు దగ్గర చేయాలనే లక్ష్యంతో ముందుకి వెళుతున్నట్టు ఆయన వివరించారు. త్వరలోనే వీటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు చేరువ చేయడంతోపాటు, సామాగ్రిని కూడా అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అన్నిరకాల పంటలకు బిందు, తుంపర సేద్యాన్ని వినియోగించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీఎంఐపీ పీడి వివరించారు.