విజయనగరం స్పందనకు 396 వినతులు.. 


Ens Balu
3
Vizianagaram
2021-09-13 13:39:17

విజయనగరం జిల్లాలో  ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కు సోమవారం 396 వినతులు అందాయి.  ఈ వినతులను సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిశోర్  కుమార్,  మయూర్ అశోక్ , జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు లు  స్వీకరించారు.  డి.ఆర్.డి.ఎ. శాఖకు 70 వినతులు  ముఖ్యంగా పించన్లు, రెవెన్యూ శాఖకు 296  ముఖ్యంగా ఇంటి స్థలాలు,  రేషన్ కార్డు లు, డిసిహెచ్ఎస్ కు 20 వినతులు, డిఎం అండ్ హెచ్ ఓకు వికలాంగు పింఛన్లు తదితర అంశాల పై దరఖాస్తులు అందాయి.  ఆయా శాఖల అధికారులకు పంపుతూ  వెంటనే పరిష్కరించాలని సూచించారు.