14 నుంచి ఎలుకల నియంత్రణ కార్యక్రమం..
Ens Balu
4
Kakinada
2021-09-13 15:50:48
తూర్పుగోదావరి జిల్లాలోని 64 మండలాల్లో సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకూ సామూహిక ఎలుకల నియంత్రణ కార్యక్రమం చేపడుతున్నట్టు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన కాకినాడలో తన కార్యాయంలో మీడియాతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే అన్ని మండలాల వ్యవసాయ అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. పొలంబడి కార్యక్రమం ద్వారా కార్యక్రమం చేపట్టి రైతులకు అవగాహన కల్పించనున్నట్టు జెడి మీడియాకి వివరించారు.