ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై బలవర్ధక ఆహారంతోపాటు, పాలు కూడా యాప్ ద్వారా అందించనున్నట్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జివి సత్యవాణి తెలియజేశారు. మంగళవారం కాకినాడలో తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 28 ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీలకు యాప్ వినియోగంపై శిక్షణ ఇచ్చామన్నారు. ఇకపై తల్లులు కూడా ఖచ్చితంగా కేంద్రాని వెళ్లే ఆహారం తీసుకోవాల్సి వుంటుందన్నారు. అదే సమయంలో బలవర్ధక ఆహారంలో తేడాలు వచ్చినా, తక్కువగా అంగన్వాడీలు ఇచ్చినా సిడిపిఓలకు ఫిర్యాదు చేయాలన్నారు.