శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌..


Ens Balu
2
Devuni kadapa temple
2021-09-17 14:30:40

డా.వైఎస్‌ఆర్‌ జిల్లా దేవుని కడప శ్రీలక్ష్మీ  వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌ వాల‌కు శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు. ఇందుకోసం సాయంత్రం 6 గంట‌ల‌కు విష్వక్సేనపూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, మృత్సం గ్రాహ‌ణం, అంకురార్పణ జ‌రిగింది.సెప్టెంబరు 18వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్ఠార్చ‌న‌, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 19వ తేదీ ఉదయం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6 గంటలకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 20న ఉదయం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ త‌దిత‌ర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఆల‌యంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించ‌నున్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఏఈవో మురళీధర్ , టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.