కౌంటింగ్ అయ్యేవరకూ మద్యం బంద్..


Ens Balu
2
Visakhapatnam
2021-09-18 05:44:35

విశాఖ జిల్లాలో ఈ నెల 19న ఆధివారం  ఎం .పి.టి.సి., జెడ్.పి.టి.సి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతం మైన వాతావరణంలో సజావుగా నిర్వహణకు  అన్ని రకాల ఏర్పాట్లతో  సిద్దంగా  ఉండాలని అధికారులను  జిల్లా కలెక్టర్  డా. ఎ.మల్లిఖార్జున  ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేవరకు  జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం  దుకాణాలు, బార్ లు, టి.సి.ఎస్ షాపులు, క్లబ్స్, క్యాంటీన్స్, టూరిజం బార్ లు , ఎ.పి.ఎస్.బి.సి.ఎల్ డపాట్స్ మూసివేసి సంపూర్ణ డ్రైడె  పాటించాలని కలెక్టర్  ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా,మద్యం  అమ్మకాలు జరగకుండా పూర్తి నిఘా ఏర్పాటు చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో నైనా నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే చట్ట ప్రకారం సంబందిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ ప్రకటనలో స్పష్టం చేసారు.