అప్పన్న ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు..
Ens Balu
2
Simhachalam
2021-09-18 08:36:57
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఈమేరకు సింహాచలం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవిత్రోత్సవాల సమయంలో స్వామిని దర్శించుకుంటే తెలిసీ, తెలియక చేసిన తప్పులను స్వామి క్షమిస్తారని నమ్మిక ఉందన్నారు. కరోనా పూర్తిస్థాయిలో సమసిపోయి జనజీవనం సాధారణ మార్గంలోకి రావాలని స్వామిని కోరుకున్నట్టు గంట్ల చెప్పారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.