అప్పన్నకు కాకినాడ ఎంపీ వంగాగీత పూజలు..


Ens Balu
2
Simhachalam
2021-09-20 03:59:20

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ వంగా గీత దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ ఎంపీకి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎంపీ అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.