26, 27 రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ పర్యటన..


Ens Balu
2
Tirupati
2021-09-20 06:24:36

ఈ నెల 26, 27  తేదీలలో  రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ చిత్తూరు  జిల్లాలో పర్యటించ నున్నట్లు  జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్  ఒక ప్రకటన లో తెలిపారు.  రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ చైర్మన్  జంగా కృష్ణముర్తి , కమిటీ సభ్యులు (శాసన సభ్యులు)  బొత్సా  అప్పలనరసయ్య,  అన్నమ రెడ్డి అదిప్ రాజు ,  బుర్రా మధుసూదన్ యాదవ్,  ఎన్. వెంకటే గౌడ ,  రమేష్ బాబు సింహాద్రి,   కె. పెద్దిరెడ్డి,   వెంకటరామిరెడ్డి,  బొల్లా బ్రహ్మ నాయుడు, పి. జి. వి. ఆర్. నాయుడు, దువ్వారపు రామారావు ( ఎం ఎల్ సి) లు ఈ నెల 26 న  వెలగపూడి నుండి బయలుదేరి తిరుమల చేరుకొని బస చేస్తారు.  తేది 27 న ఉదయం తిరుమల  శ్రీవారిని దర్శించుకొని, తిరుపతి పద్మావతి  అతిధి గృహం చేరుకుంటారు.  ఉదయం  11.00 గంటల నుండి బి. సి. సంఘాలు, వ్యక్తుల  నుండి  వినతులు స్వీకరించి,  11.30 గంటలకు  టి. టి. డి. లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు ,  మధ్యాహ్నం 2.30 గంటలకు జిల్లా ఉన్నతాదికారులతో అమలు అవుతున్న బి సి సంక్షేమ పథకాలపై  సమీక్ష  నిర్వహించి వై. ఎస్. ఆర్. కడప  బయలు దేరనున్నారని  కలెక్టర్ ఆ ప్రకటన లో తెలిపారు.