విజయనగరం స్పందనకు 205 వినతులు..
Ens Balu
1
Vizianagaram
2021-09-20 11:14:59
విజయనగరం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కు సోమవారం 205 వినతులు అందాయి. ఈ వినతులను జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిశోర్ కుమార్, డా. మహేష్ కుమార్, మయూర్ అశోక్ , జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు లు స్వీకరించారు. ముఖ్యంగా పించన్లు, ఇంటి స్థలాలు, అమ్మఒడి , రేషన్ కార్డు లు తదితర అంశాల పై దరఖాస్తులు అందాయి. ఆయా శాఖల అధికారులకు పంపుతూ వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన వినతులు 37,రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులు 168 వినతులు అందాయి. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ స్పందన వినతులు మున్సిపల్, ఐ.సి.డి.ఎస్, విద్యా శాఖల వద్ద ఎక్కువగా పెండింగ్ ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. అధికారులంతా గడువు దాటకుండా వినతులను పరిష్కరించాలని సూచించారు.