విశాఖ జివిఎంసీ స్పందనకు 50 ఫిర్యాదులు..
Ens Balu
2
జివిఎంసీ
2021-09-20 12:27:40
“స్పందన” కార్యక్రమంలో భాగంగా జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రుజన ప్రజల నుంచి నేరుగా స్వీకరించిన ఫిర్యాదులు రెండవ జోనుకు 02, మూడవ జోనుకు 06, నాలుగవ జోనుకు 05, అయిదవ జోనుకు 07, ఆరవ జోనుకు 05, ఎనిమిదవ జోనుకు 01, మెయిన్ ఆఫీసు నకు 24, మొత్తం 50 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, డి.పి.ఓ. చంద్రిక, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శివ ప్రసాద్ రాజు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, కె.వి.ఎన్.రవి, గణేష్ బాబు, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆదినారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.