వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే మైనార్టీల అభివ్రుద్ధి..


Ens Balu
2
Anantapur
2021-09-22 12:04:30

వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలోనే మైనార్టీల అభిరుద్ది సాధ్యంమవుతోందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగర పాలక సంస్థ లోని మేయర్ కార్యాలయంలో బుధవారం కార్పొరేటర్లతో కలసి మేయర్  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ నంద్యాల సంఘటనను టీడీపి నేతలు రాజకీయ అవసరాలకు వాడుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.వైసీపీలో ముస్లిం లకు అన్యాయం జరుగుతోందని టీడీపీ నేతల ఆరోపణలు సరి కావన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా లో రాజకీయ ప్రాధాన్యత ముస్లిం మైనారిటీలకు దక్కుతోందన్నారు.రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అనంతపురం నగరంలోని ముస్లిం మైనారిటీలకు రాజకీయ పదవులలో ప్రాధాన్యత దక్కుతోందని,నాలుగు కీలక పదవులు ఒకేసారి ముస్లిం మైనారిటీలకు అనంతపురం నగరంలో దక్కడం జిల్లా చరిత్రలోనే ఇదే  తొలిసారి అన్నారు.అలాంటి అవకాశం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమైందని గుర్తు చేశారు.ముస్లింలకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు కల్పించి విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రాధాన్యత కల్పించారని,గతంలో ఎప్పుడూ లేని విధంగా మైనార్టీ సబ్ ప్లాన్ ను అమలు చేస్తూ సి ఎం జగనన్న తీసుకున్న నిర్ణయం మైనార్టీల కుటుంబాల్లో వెలుగులు నింపనుందని ఆయన తెలిపారు.ముస్లింల అభిరుద్దీ ని కోరుతున్నది వై ఎస్ కుటుంబం  మాత్రమేనని,ఆ మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రాధాన్యత ముస్లింలకు కల్పిస్తూ ముస్లిం మైనారిటీల పట్ల తమ కుటుంబానికి ఉన్న ప్రేమ,ఆప్యాయతను చూపిస్తూన్నారని కొనియాడారు.ముస్లిం మైనారిటీలకు ఇస్తున్న గుర్తింపును ముస్లిం మైనారిటీలు మారువరనన్నారు.ఇప్పటికైనా టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు.కార్పొరేటర్ సైఫుల్లా భేగ్ మాట్లాడుతూ మైనార్టీల గురించి మాట్లాడే ఆర్వ్హత టీడీపీ నేతలకు లేదన్నారు.ఐదేళ్ళ టీడీపీ పాలనలో నాలుగున్నర సంవత్సరాలు క్యాబినేట్ లో మైనార్టీ వ్యక్తి కి ప్రాతినిధ్యం లేకుండా పాలన కొనసాగించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.మంత్రి పదవి ఆశ చూపి పార్టీలో చేర్చుకుని అత్తారు చాంద్ బాషా,జలీల్ ఖాన్  ను వంచించినప్పుడు టీడీపీ మైనార్టీ నేతలు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.నేడు డిప్యూటీ సీఎం పదవి తోపాటు ఎమ్మెల్సీలు మేయర్లు నామినేటెడ్ చైర్మన్లు వంటి అనేక పదవుల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతోందన్నారు. అంతేకాకుండా ముస్లింల అభ్యున్నతి కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు.తెలుగుదేశం పార్టీలో, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎక్కువ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారో టీడీపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.నేడు నంద్యాల ఘటన గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు అదే నంద్యాలలో ముస్లిం యువకులపై అక్రమ కేసులు నమోదు చేసినప్పుడు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.ఎవరి హయాంలో ముస్లిం మైనారిటీలకు న్యాయం జరుగుతోందో గుర్తుంచుకోవాలన్నారు.ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మనుకోవాల్సిన అవసరం టీడీపీ నేతలకు ఎంతైనా ఉందన్నారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు రహంతుల్లా,ఇషాక్, హసీనా బేగం,లాలూ,నాయకులు దాదు,దాదా ఖలందర్ తదితరులు పాల్గొన్నారు.