తిరుమల శ్రీవారి అభిషేకానికి జిసిసి తేనె..


Ens Balu
3
Visakhapatnam
2021-09-23 05:12:10

తిరుమల శ్రీవారి అభిషేకానికి విశాఖ జిసిసి తేనె వినియోగిస్తామని టిటిడిచైర్మన్ ప్రకటించారని జిసిసి చైర్మన్ శోభ స్వాతిరాణి చెప్పారు. విశాఖలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఆ దేవదేవుడు తిరుమల వేంకట్వరశ్వరస్వామికి  జిసిసి తేనె అభిషేకానికి వినియోగిస్తామని ప్రకటన రావడం చాలా అభినందనీయమన్నారు. టిటిడి నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేనె సేకరించి జిసిసి అమ్మెవారికి ఎంతో ఉపాది లభిస్తుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే 1800 కేజీల తేనె టిటిడి నుంచి ఆర్డర్ వచ్చిందని కూడా ఆమె తెలియజేశారు. టిటిడి ఉప ఆలయాలకు కూడా జిసిసి తేనె వినియోగించాలని టిటిడి ఆదేశాలివ్వడం తాను మరిచిపోలేనని చెప్పుకొచ్చారు.