సిటిజన్ ఔట్ రీచ్ ను పరిశీలించిన కమిషనర్..


Ens Balu
2
Kakinada
2021-09-24 10:12:01

ప్రభుత్వ సేవలు ప్రజలకు తెలిసేలా సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమం చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్  దినకర్ పుండ్కర్ సచివాలయ సిబ్బంది ఆదేశించారు. శుక్రవారం కాకినాడలోని 20వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం ద్వారా సేవలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ సేవలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్  సి.హెచ్. నాగ నరసింహారావు    మాట్లాడుతూ  సచివాలయం ద్వారా అందిస్తున్న పథకాలను ,సేవలను పొందుతున్న విధానాన్ని గురించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్వయంగా  విచారించారు. సచివాలయ సిబ్బంది తాలూకు ఫోన్ నెంబర్లను ప్రతి ఇంటికి అందాయో లేదో వాకబు చేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్  సత్యనారాయణ గారు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.