వంశీ బాగున్నారా..CMవైఎస్ జగన్ ఆత్మీయ పలకరింపు


Ens Balu
2
కలెక్టరేట్
2020-09-11 15:32:29

ఏం వంశీ బాగున్నారా...అంటూ విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు సిహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ ను సీఎం వైఎస్ జగన్ జగన్మోహనరెడ్డి ఎంతో ఆత్మీయంగా పలుక రించారు. శుక్రవారం వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించిన తరువాత అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖప ట్నం నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతోపాటు వంశీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖజిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తోమా ట్లాడానికి ముందుగానే ఏం వంశీ బాగున్నారా అంటూ పలకరించడం విశేషం. అనంతరం వైఎస్ ఆసర పథకాన్ని మహిళల అభివ్రుద్ధికోసమే చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలిచ్చిందో వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. అధికారులు ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చేయడంలో విశేషంగా క్రుషిచేయాలని అన్నారు. సీఎం వైఎస్ జగన్ వంశీని పలుకరించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది...