మావోయిస్టులపై ఏడాది నిషేధం..ఉత్తర్వులు జారీ
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 5
                            
                         
                        
                            
Velagapudi
                            2020-09-11 15:52:25
                        
                     
                    
                 
                
                    ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు కార్యకలాపాలపై ఏడాదిపాటు నిషేధాన్ని పొగిడిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ భధ్రతా చట్టం 1992 ప్రకరం ఈ ఉత్తర్వులు పొడిగింపు కొనసాగుతుందని పేర్కొంది. కాగా ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఏడాది పాటు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో తెలియజేసింది. మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుంబంధ సంస్థలు రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ పైనా ఇదే ఉత్తర్వులు అమలు జరుగుతాయని కూడా తెలిపింది. ఇదిలా వుండగా విశాఖ ఏజెన్సీలోని 15 రోజుల్లో రెండు మూడు సార్లు తుపాకుల మొత మోగింది. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మన్యంలోకి మావోయిస్టు రాష్ట్రపార్టీ నాయకులు వచ్చేరనే సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులు తారపడటంతో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు ఫైరింగ్ ఓపెన్ చేయగానే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ ప్రభుత్వం నిషేధం విధించిన అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.