జివిఎంసికి 6వేల మాస్కులు వితరణ చేసిన విశాఖ డెయిరీ


Ens Balu
3
మహా విశాఖ నగరపాలక సంస్థ
2020-09-11 19:53:39

మహా విశాఖ నగర పరిధిలో కరోనా నియంత్రణలో భాగస్వాములుగా ఎంతో సేవలందిస్తున్నారని విశాఖ డెయిరీ సీఈఓ ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఈమేరకు శుక్రవారం పారిశుధ్య కార్మికుల రక్షరార్ధం 6వేల మాస్కులు జీవిఎంసికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జివిఎంసీ పరిధిలో పారిశుధ్య కార్మికులు వీటిని తప్పకుండా ధరించి విధులు నిర్వహించాలన్నారు. ఏ ఒక్కరూ కరోనా వైరస్ భారిన పడకుండా ఉండేందుకు విశాఖ డెయిరీ వంతుగా వీటిని అందజేస్తు న్నామని చెప్పారు. ఈ మాస్కులను అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుకి అందజేశారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులను గుర్తించి మాస్కులు వితరణ చేయడం అభినందనీయమన్నారు. స్వచ్చందంగా ఈరకమైన సహకారం అందించే దాతలను జీవిఎంసి గుర్తిస్తుందన్నారు. వారి సహాయంతో అందించిన మాస్కులను పారిశుధ్య కార్మికుల కోసం వినియోగిస్తామని విశాఖ డెయిరీ సీఈఓకి తెలియజేశారు.