శ్రీ సూర్యనారాయణ స్వామివారికి మంత్రి అవంతి పూజలు..


Ens Balu
4
Srikakulam
2021-10-04 16:37:18

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. సోమవారం అరసవల్లి శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనములు పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్య ప్రకాష్ మంత్రికి సన్మానించి సూర్యనారాయణ స్వామి వారి ఛాయాచిత్ర ఫొటో ను అందజేశారు.  ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్, తహసీల్దార్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.