సింహాద్రి అప్పన్నకు గంట్ల ప్రత్యేక పూజలు..


Ens Balu
6
Simhachalam
2021-10-06 05:24:52

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామివారిని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు, దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు దర్శించుకున్నారు. బుధవారం ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వం ద్రుష్టికి జర్నలిస్టుల ప్రధాన సమస్యలు తీసుకెళ్లినట్టు చెప్పారు. అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్లు వచ్చేలా క్రుషి చేస్తున్నట్టు శ్రీనుబాబు వివరించారు.