ఆ దళిత ఎమ్మెల్యేని పట్టుకొని వాడు,వీడు అన్నాడంటే..
Ens Balu
2
S.Rayavaram
2020-09-12 12:11:03
అధికారపార్టీ వైఎస్సార్సీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే గొల్లబాబురావు అంటే తెలియని వారుండరు రాష్ట్ర వ్యాప్తంగా... అసెంబ్లీ ఎస్సీ ఎస్టీ వెల్పేర్ కమిటీ సభ్యునిగా మంచివ్యక్తిగా, దళిత వర్గానికి చెందిన ఉన్నత చదువరిగా, పార్టీ విధేయునిగా, మంచి నాయకుడిగా పార్టీలోనే ఎంతోపేరు..అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎస్.రాయ వారా నికి చెందిన ఒక మాజీ ఎంపీటిసి బొలిశెట్టిగోవిందరావు అనే వ్యక్తి పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ పేరు చెబుతూనే, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెట్టిన సమావేశంలో ఎమ్మెల్యే గొల్లబాబూరావుని వాడు, వీడు అనడంతోపాటు...తాను లేకపోతే నియోజకవర్గంలో ఏ జిరిగేదో అంటూ తారాస్థాయిలో మాట్లాడిన మాటల ఆడియో టేప్ రికార్డింగ్ వాయిస్ విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బొలిశెట్టి గోవిందరావుని కాదని పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్(ఉన్నత చదువులు కలిగిన మామిడి మంగతాయారుకి) పదవిని కట్టబెట్టి.. మరో వర్గానికి(మామిడి చంటి)కి పార్టీ వ్యవహరాలు దగ్గరుండి చూసుకునే అవకాశం ఇచ్చారనే అక్కసుతో ఆ వర్గారినికి చెందిన వ్యక్తితో ఎమ్మెల్యే గొల్లబాబూరావు ముందే సోమవారం రాత్రి అడ్డురోడ్డులో జరిగిన సమావేశంలో తన్నుకున్నారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా గోవిందరావు స్థానిక మీడియాని బెదిరించి మరీ అడ్డుకట్టవేశారని సమాచారం.. కానీ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ వెలుగులోకి తీసుకు వచ్చింది. ఆ గొడవ జరిగిన తరువాత అక్కడ ఎమ్మెల్యేతో ఛాలెంజ్ చేసి వచ్చి మరీ తన ఇలాకాలోని తోటలో పలువురు కార్యకర్తలు, నాయకులతో సమావేశం పెట్టి...చేసిన వ్యాఖ్యల ఆడియోను కూడా ఈఎన్ఎస్ నెట్వర్క్ అత్యంత కీలక వ్యక్తుల ద్వారా సంపాదించింది. ఆ సమావేశంలో తనకు ఉపయోగ పడకపోతే ఎవ్వరైనా ఒక్కటే అంటూ తన ఆవేశాన్ని వెల్లగక్కుతూనే కార్యకర్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా పదేళ్లుగా పనిచేసిన వారిని కాదని నిన్నగాక మొన్న వచ్చిన వారికి పనులు చేసిపెడితే..మీ పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో నాలానే వుంటుంది అన్నారు. అంతేకాదు, పార్టీలో పదేళ్ల నుంచి ఉన్నాను వైఎస్ జగన్ నాకు ఏమిచ్చాడు అని ఆవేశంగా ఊగిపోయాడు. పైగా తాను ఖర్చుపెట్టకపోతే ఎమ్మెల్యేగా బాబూరావు గెలిచేవాడు కాదని, ఎమ్మెల్యేని వాడు అనడానికి తాను వెనుకాడటం లేదని కూడా సంబోధించాడు. అంతేకాదు మనల్నికాదని, మనకు పనిచేయని ఎమ్మెల్యే ఈ నియెజవర్గంలోకి రావడానికే భయపడాలంటూ కార్యకర్తలను తప్పుదోవ పట్టించాడు. గతంలో బొలిశెట్టి గోవిందరావు చేస్తున్న వ్యవహారాలకు విసిగి పోయిన ఎమ్మెల్యే గొల్లబాబూరావు, తన నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో ఎక్కడికి వెళ్లినా తన పనిని తాను చేసుకోనివ్వకుండా, కొందరు అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడునెలలుగా సాగుతున్న ఈ చాపకింద నీటి రబస సెప్టెంబరు నెలలో గానీ బయట పడలేదు. బొలిశెట్టి తనకు వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తూ, దళిన సామాజిక వర్గ ఎమ్మెల్యేకి ప్రజలకు సేవచేసుకునే బాగ్యం ఇవ్వకుండా చేస్తున్నని, కొందరు ప్రభుత్వ అధికారులతో కలిసి తన ఇష్టం వచ్చినట్టు కార్యకలాపాలు చేస్తున్నారనే ఈయననె ఎమ్మెల్యే పక్కన పెట్టినట్టు నియోజవర్గ కేడర్ బహిరంగంగానే చెబుతోంది. ఇదే సమయంలో గోవిందరావుని కాదని మామిడి చంటిని వెనుకేసుకు వస్తూ అన్ని పనులు ఆయనతోనే చేయిస్తే...ఇన్నేళ్లు పనిచేసిన మనం ఏమవ్వాలో అర్ధం చేసుకోవాలని కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. కొందరినైతే ఏకంగా నాలుగు మండలాల్లో ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొన నీయకుండా కూడా చేశారని వారని కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇదంతా వెనుక విధేయుడిగా వుంటూనే గోవిందరావు చేశారని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ కేవలం...బొలిశెట్టిగోవిందరావు కార్యకర్తలతో సమావేశం పెట్టి, ఆగ్రహంతో, తనకు అనుకూలంగా ఎమ్మెల్యే లేరనే విషయాన్ని కార్యకర్తలకు, నాయకులకు అర్ధమయ్యేలా చేసిన వ్యాఖ్యలు. పూర్తివివరాలు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ లో పూర్తి సంభాషణ వినవచ్చు...ఒక ఎమ్మెల్యే దళిత సీనియర్ ఎమ్మెల్యేని కనీసం ఎలాంటి పదవి లేని ఒక మాజీ ఎంటిసి ఈ విధంగా బెదిరిస్తున్నారంటే ఈయన వెనుక ఏ స్థాయి వ్యక్తులున్నారోననే అదనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నియోజవర్గ నాయకులను శాసించే స్థాయిలో వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది..!