యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్..


Ens Balu
6
Visakhapatnam
2021-10-10 08:31:46

ప్రశాంత వాతవరణంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున చెప్పారు. ఆదివారం విశాఖలో జరుగుతున్న సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు తీరును  కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. గాయత్రీ విద్యాపరిషత్ డిగ్రీ, అండ్ పీజీ కాలేజీ, విశాఖ వేలీ కేంద్రాలను పరిశీలించి అక్కడి చేసిన ఏర్పాట్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.మల్లిఖార్జున మాట్లాడుతూ,  కరోనాను ద్రుష్టిలో పెట్టుకొని మాస్కుధారణ, భౌతిక దూరం పాటించడంతోపాటు, పల్స్ స్ర్కీనింగ్, వైద్యసిబ్బందిని నియమించామన్నారు.  పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది విధుల పట్ల కలెక్టర్ సంత్రుప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు పాల్గొన్నారు.