పైడితల్లమ్మ ఉత్సవాలకు ఆన్ లైన్లో టిక్కెట్లు..
Ens Balu
2
Vizianagaram
2021-10-10 08:40:14
విజయనగరంలోని శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి తెలిపారు. ఆదివారం 48వ వార్డ్ సచివాలయంలో ఆన్లైన్ టిక్కెట్లు విక్రయాలను ప్రారంభించారు. అనంతరం ఆమె 400 రూపాయల తో రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ, రూ.200/- విలువ గల టికెట్లను ఆదివారం 5వార్డులో విక్రయించ నున్నట్లు తెలిపారు. సోమవారం నుండి మండల ప్రధాన కేంద్రాల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. టిక్కెట్లు అమ్మిన సంఖ్యను బట్టి భక్తులకు ఏర్పాట్లను గావిస్తారని త్వరగా భక్త్తులు టిక్కెట్లు కొనుగోలు. చేయాలని అన్నారు. ఈమాసం అంత పవిత్రమేనని, భక్తులు ఒకే సారి రావద్దని, కోవిడ్ ఉందని గుర్తు పెట్టుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా.జి.సి కిషోర్ కుమార్, ఆర్.డి.ఓ భవాని శంకర్, ఎన్. ఐ. సి డి.ఐ. ఓ నరేంద్ర, కార్పొరేటర్ ధనలక్ష్మి, అమ్మవారి దేవస్థానం ఈ.ఓ కిషోర్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.