కల్యాణకట్ట క్షురకులకు యూనిఫాం విరాళం..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
Tirumala
                            2020-09-12 19:10:51
                        
                     
                    
                 
                
                    తిరుమల కల్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న పురుష, మహిళా క్షురకులకు రూ.10 లక్షలు విలువ గల రెండు జతల పంచలు, షర్టులు, చీరలను శనివారం ఉద యం టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విరాళంగా అందించారు. తిరుమల ప్రధాన కల్యాణకట్టలో 1050 మంది పురుష క్షురకు లకు రెండు జతల పంచలు, షర్టులు (2,100 పంచలు, షర్టులు),  275 మంది మహిళా క్షురకులకు రెండు జతల చీరలను (550 చీరలు ) టిటిడి అదనపు ఈవో ఏ.వి. ధర్మారెడ్డి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా కల్యాణకట్ట క్షురకులు ధర్మకర్తల మండలి సభ్యురాలు  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ కార్యక్ర మంలో డెప్యూటీ ఈవో  సెల్వం, ఏఈవో  జగన్మోహనాచారి,  ఇతర కార్యాలయ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.