మైనార్టీ పేదలకు సాయం అభినందనీయం..


Ens Balu
3
Anantapur
2021-10-11 12:35:59

అనంతపురంలో మైనార్టీ పేదలకు జమాతే ఇస్లామి హింద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆదర్శ నగర్లో జమాతే ఇస్లామి హింద్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లింల అభివృద్ధి కోసం పెన్షన్ స్కీమ్ ప్రారంభ  కార్యక్రమంలో మేయర్ తోపాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ఇస్లామి లేని వారికి ఉన్నవారు ఇమ్మని చెపుతోందని జమాతే ఇస్లామి హింద్ ఇస్లాం ధర్మాన్ని పాటిస్తోందని అభినందించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబా ఫక్రుద్దీన్, వైకాపా నాయకులు కొండ్రేడ్డి ప్రకాష్ రెడ్డి,జమాతే ఇస్లామి హింద్ సంస్థ ప్రతినిధులు సాదిక్, యాసిర్ అహ్మద్,వలీ తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు