జీవిఎంసీ స్పందనకు 36 ఫిర్యాదులు..


Ens Balu
5
జివిఎంసీ
2021-10-11 14:55:46

జివిఎంసి లో సోమవారం నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో 36 ఫిర్యాదులు వచ్చాయని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.  జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజనతో కలసి సమావేశ మందిరం ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు.  ఇందులో రెండవ జోనుకు 04, మూడవ జోనుకు 08, నాలుగవ జోనుకు 04, అయిదవ జోనుకు 07, ఆరవ జోనుకు 05, ఎనిమిదవ జోనుకు 07, మొత్తము 35 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి,  డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, ఎ.డి.హెచ్. ఎం.దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, గణేష్ బాబు, కె.వి.ఎన్. రవి తదితర అధికారులు పాల్గొన్నారు.