డయల్ యువర్ మేయర్ కు 36 ఫోన్ కాల్స్..
Ens Balu
6
జివిఎంసీ
2021-10-11 15:03:32
జివిఎంసి లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి 36 ఫోన్ కాల్స్ వచ్చాయని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజనతో కలసి సమావేశ మందిరం నందు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహించారు. ఒకటవ (భీమిలి) జోనుకు 03, రెండవ జోనుకు 03, మూడవ జోనుకు 04, నాలుగవ జోనుకు 03, అయిదవ జోనుకు 04, ఆరవ జోనుకు 13, ఏడవ (అనకాపల్లి) జోనుకు 02, ఎనిమిదవ జోనుకు 03, యు.సి.డి. విభాగమునకు 01, మొత్తము 36 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, ఎ.డి.హెచ్. ఎం.దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, గణేష్ బాబు, కె.వి.ఎన్. రవి తదితర అధికారులు పాల్గొన్నారు.