హై లెవెల్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి..
Ens Balu
2
Srikakulam
2020-09-12 19:17:04
శ్రీకాకుళం జిల్లాలోని హైలెవల్ కెనాల్ పనులు వేగవంతం చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. కెనాల్ పనుల ప్రగతిపై శని వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రాధాన్యతా ప్రాజెక్టులలో వంశధార – నాగావళి అనుసంధాన హై లెవెల్ కెనాల్ పనులు ఉన్నాయని సభాపతి అన్నారు. పెండింగు బిల్లులు త్వరగా విడుదల చేయుటకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. భూ సేకరణలో రైతులతో సమస్యలు ఉన్న చోట రైతులతో మాట్లాడతామని సీతారాం తెలిపారు. ఇతర ప్రాంతాల్లో భూసేకరణ పెండింగు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. వంశధార – నాగావళి అనుసంధానం వలన అదనంగా కొంత ఆయకట్టుకు నీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సి.హెచ్.శివరాం ప్రసాద్, వంశధార పర్యవేక్షక ఇంజనీరు పి.రంగారావు, కార్యనిర్వాహక ఇంజనీరు జి.సుశీల్ కుమార్, ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ కాశీవిశ్వనాథ్, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.