పోస్టల్ కస్టమర్లకు టెక్నాలజీ ఆధారిత సేవలు..


Ens Balu
8
Visakhapatnam
2021-10-16 12:06:35

తపాలాశాఖ ద్వారా వినియోగదారులకు సాంకేతిక ఆధారిత సేవలు అందిస్తున్నామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఎన్.సోమశేఖరరావు అన్నారు. విశాఖలోని పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 75వ జాతీయ తపాలా వారోత్సవాల ముగింపు కార్యక్రమం(వినియోగదారుల సదస్సు)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న టెక్నాలజీని వినియోగిస్తూ పోస్టల్ శాఖలో కూడా మొబైల్ డెలివరీ విధానాన్ని(పోస్టల్ మొబైల్ యాప్) ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. అదేవిధంగా నోడల్ డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అక్టోబరు 9వ తేది నుంచి 16వ తేదీ వరకూ వారోత్సవాలు ఎంతోబాగా జరిగాన్నాయన్నారు. ఆఖరిరోజు పోస్టల్ డేని నిర్వహించారు. పలువురు వినియోగదారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆదిత్యకుమార్, వై.నర్శింగరావు, ఇతర అధికారులు,  తపాలాశాఖ ప్రభుత్వ వినియోగదారలు పాల్గొన్నారు. 
సిఫార్సు