కనీస మద్దతుధరపై అవగాహన కల్పించాలి..


Ens Balu
2
Kakinada
2021-10-16 12:40:09

ఖరీప్ 2021-22 పంట కాలనాకి కనీస మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేసే విధంగా పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించాలని ఇన్ చార్జి కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పేర్కొన్నారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ లోని వివేకానంద సమావేశపు మదిరంలో నెలవారీ జిల్లా స్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశం నిర్వహించారు. వరికి కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలకు రూ. 1940 లు, 75 కేజీ బస్తా రూ. 1455 లు, గ్రేడు ‘ ఎ ’ రకము క్వీంటారుకు రూ. 1960లు, 75కేజీ బస్తా రూ.1470లు ప్రభుత్వ ధరగా నిర్ణయించామన్నారు. సందేహాల కొరకు కంట్రోల్ రూం నెం.0884-6454341 సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాశాఖ జాయిట్ డైరెక్టర్ ఎన్.వియజకుమార్, ఇతర వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.