20న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం..


Ens Balu
10
Tirupati
2021-10-17 08:46:35

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 20వ తేదీ అన్నాభిషేకం జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ సందర్భంగా ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు అన్నాభిషేకం అలంకారం ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం సహస్రనామార్చన, దీపారాధన చేపడతారు. సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా ఉద‌యం 8 నుంచి 11 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులను అన్నలింగ దర్శనంకు అనుమ‌తిస్తారు.

సిఫార్సు