సింహాద్రి అప్పన్న భక్తులకు శుభవార్త..


Ens Balu
7
Simhachalam
2021-10-18 06:20:04

విశాఖజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సించలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామి వారి దర్శన సమయం పెంచినట్టు ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు సింహాచలంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు   వేకువ జాము నుంచి ప్రతీ రాత్రి 9గంటల వరకూ స్వామి వారి దర్శనాల సమయం పెంపుదల చేసినట్టు ఆ ప్రకటనలో వివరించారు.  రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈఓ తెలియజేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.