కమిషనర్ లక్ష్మీశకు SCRWA శుభాకాంక్షలు..


Ens Balu
9
Visakhapatnam
2021-10-30 15:48:05

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)  కమిషనర్ గా లక్ష్మీశ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు .. పరిశుభ్రతకు  తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా కృషిచేస్తానని  మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు .. ఈ సందర్బంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు  జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు . విశాఖ నగరాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్బంగా  స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు .కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఎస్.సి.ఆర్.డబ్ల్యూ. ఏ ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ (సత్య),కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు కాళ్ళ సూర్య ప్రకాష్ (కిరణ్),సభ్యులు కొండ్రి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.