ఉప రాష్ట్రపతికి విమానాశ్రమంలో ఘన స్వాగతం..


Ens Balu
2
Visakhapatnam
2021-11-02 07:35:47

విశాఖ జిల్లాలో 5 రోజుల పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత ఉప రాష్ట్రపతి కి విమానాశ్రయంలో పలువురు అధికారులు,  ప్రజా ప్రతినిధులు, నేవీ అధికారులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్యనాయుడు కు విమానాశ్రయంలో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్.ఎల్.ఎ. పి.వి.జి.ఆర్.నాయుడు, రాష్ట్ర డి.జి.పి. గౌతం సవాంగ్, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, కమిషనర్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ సిన్హా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బి.క్రిష్ణా రావు, నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్టి, వి.ఎస్.ఎమ్,  ప్లాగ్ ఆఫీసర్ కమాండింగ్  ఈస్టర్న్ ఫ్లిట్ (FOCEF) తదితరులు ఘన స్వాగతం పలికారు.