విశాఖలో కమర్షియల్ ప్రెస్ మీట్లు మన కులపోల్లే చూస్తారు పర్లేదా..?!


Ens Balu
141
Visakhapatnam
2024-02-12 14:59:04

విశాఖలో సాధారణ ఎన్నికల ప్రచారం ఆ కులపోళ్లకు కాసుల పంట పండిస్తోంది..కాదు కాదు పండించుకునేలా చేసుకుంటున్నారు. మహా నగరంలో కమర్సియల్ ప్రెస్ మీట్లు అయితే వారి కులపోల్లే చూస్తారట. సదరు కులపోళ్లకు మీడియా లేకపోయినా, కనీసం వార్త రాయడం రావకపోయినా, పత్రిక లేకపోయినా, టీవీ ఛానల్ రాకపోయి నా అవేమీ వీరికి అనవసరం. నిజమైన, వార్తలు రాసే జర్నలిస్టులకిచ్చే మొత్తాలన్నీ వారి కులపోళ్లకు ఇచ్చేస్తుంటారు. యరైటీ ఏంటంటే సదరు రాజకీయనాయకులు కూడా వారి కులపోళ్లతోనే ఈ కమర్షియల్ ప్రెస్ మీట్లు పెట్టించుకుంటున్నారు. వారికి కావాల్పిన ప్రచారం కావాలంటే వారి కులపోళ్లతో మాట్లాడినపుడు అక్షరం ముక్కరాయ డం కూడా రాని వారి కులపోళ్ల అధిక కులబలం, మీడియా బలం ఎవరికుంటే వారికే వీరి ప్రచార బాధ్యతలను కూడా అప్పగిస్తున్నారు. చిఛీ వీళ్లంతా మన కులపోల్లే అనుకొని ఆనంద పడిపోయి.. మన కులపోళ్లను వార్తరాసావా? మీ పేపర్ వచ్చిందా? మీ టివిలో వచ్చిందా.. మీ కేబుల్ లో ప్రసారం అయ్యిందా అని మాత్రం అడక్కూడదు.. కానీ ఇతర చిన్నా చితకా పత్రికలు, మీడియాలో వచ్చింది మన కులపోళ్ల ఖాతాలో వేసుకొని లెక్కలు చెబుతాం.. దానికి సరే అంటే అందరికీ ఇవ్వాల్సిందే మనోళ్లకే ఇచ్చేసి..వార్తలు, ప్రచారమైతే అన్ని మీడియాల్లోనూ వచ్చేలా చూస్తాం అని హుకుం కూడా జారీ చేస్తున్నారట. చేసేది లేక ఎవరు ఏమైపోతే మాకేంటి..మీడియాకి చేయాల్సిన ఖర్చుతో మన కులపోల్లే బాగుపడుతున్నారు కదా..అందరి పొట్టా కొట్టైనా అనుకొని సదరు తేడా రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు కూడా వీరినే సంప్రదిస్తున్నారు. 

దారుణం ఏంటంటే ప్రెస్ మీట్ కి వచ్చిన జర్నలిస్టులు మరీ అడుక్కోవడానికి వచ్చిన వారిలా చూస్తూ.. ఉదయం 9.30కి పిలిచి వారి కులపోళ్లంతా 11 గంటలకు వచ్చే వరకూ వీరికి టిఫిన్లు కూడా పెట్టించకుండా చాలా చులకనగా చూస్తున్నారు. ఇక్కడ ఎవరి బ్రతుకు తెరువు వారిది బయటకెళితే ఎంతో కొంత కష్టపడ్డపనికి ఖర్చులొస్తాయ నుకున్న వారి కష్టాన్ని కూడా వచ్చిన వీలేఖరులు, వారి సంఖ్య, ప్రెస్ మీట్ ప్రాంగణంలో వచ్చి నమోదైన పేర్లను బట్టి వారి కులపోళ్ల దగ్గర డబ్బులు దొబ్బేసి..వారితరు పున ఉన్న ప్రధాన మీడియాలో పనిచేసేవారికి ఇచ్చేసి, మిగిలిన వారికి మొండి చేయి చూపించడం అలవాటైపోయింది. పైగా కమర్షియల్ ప్రెస్ మీట్లకు అడుక్కోవడానికి వచ్చిన వారిలా వందల సంఖ్యలో వస్తే ఎవరు మాత్రం మేయింటేన్ చేస్తారు..? అందుకే వారికి టిఫిన్లు టీ లు ఇచ్చి పంపేసి..వారికి ఇవ్వాల్సింది అతి కష్టం మీద మన జేబులో వేసుకోవాల్సి వస్తుంది. ఈ మాత్రం మెయింటేన్ చేసి మన కులపోళ్లకు ప్రచారం కల్పించడం కూడా తప్పేనా అంటూ తిరిగి ప్రశ్నించే విధానం కూడా ప్రధాన పత్రికలు, ఛానళ్లు, మీడియా వారిని మాత్రం భలే ఆకర్షిస్తోంది.  జరిగిందతా నిర్వాహకులకు చెప్పినా..మనకోసం మన కులపోళ్లు కష్టపడి పనిచేసి..వారి కష్టాన్ని వీరు దోచేసి జేబులు నింపుకుంటే అదేదో మనకి తెలియనట్టు మళ్లీ ఈ చిన్నా, చితకా జర్నలిస్టులు వచ్చి చెబితే మాత్రం ఏం పట్టించుకుంటామంటూ నిర్వాహకులు కూడా వారి కులపోళ్లకే సపోర్టు చేయడం విశేషం. 

పైగా మన కులపోళ్లంతా యూనిటీగా ఉండాలని, ఏ రాజకీయపార్టీ గానీ, అభ్యర్ధులు గానీ, ఎమ్మెల్యేలు, ఎంపీ కేండిట్ లు పెట్టే కమర్షియల్ ప్రెస్ మీట్లు మనల్ని దాటి పోకుండా చక్కగా కంచెవేసుకొని ఉంటే అందరూ రాసే వార్తలను మన ఖాతాలోకి వేసుకొని ఎంతకాలమైనా ఏలవచ్చుననే భావనతో అనుకున్నట్టు వ్యవహరిస్తున్నారట. వంద మంది పొట్టకొట్టి ఒక్కడే తినేస్తే..వాటి ఫలితం అనుభవిస్తారని తెలిసి కూడా మన కులపోళ్ల కోసం ఆ మాత్రం కూడా చేయకపోతే ఆదిపత్యం తగ్గిపోతుందనే బాధ వీరిని తెగ వెంటాడుతోందట పాపం. వంద మంది పొట్ట కొట్టి ఒక్కడే తినడం మీడియా వ్యభిచారమని చిన్నా, చితక జర్నలిస్టులు తిట్టిన తిట్టు, శాపనార్ధనాలు వాళ్ల కులపోల్లకు మాత్రం దీవెనల్లా పనిచేస్తున్నాయి. కట్టడి చేసేకొద్దీ వాళ్ల కుల మీడియా, కుల ప్రెస్ మీట్లు, కమర్షియల్ ప్రెస్ మీట్లు అధికంగా పెట్టించుకోగలుగుతున్నారు. ఎంతైనా ఇలాంటి వన్నీ విశాఖలోనే జరుగుతాయనడానికి ఈ తేడా మీడియా వ్యవభిచార కుల కమర్షియల్ వ్యవహాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి..!?