తెల్లవాడి పేర్లు తీయాలంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకి నేటికీ భయమే..?!


Ens Balu
11
visakhapatnam
2025-06-04 05:32:18

భారతదేశానికి  స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ బ్రిటీషు వాడి ఛాయలు, వదిలి వెళ్లిన పేర్లు, పరిపాలన, నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను భయపెడుతూనే ఉన్నాయి. అలా అంటున్నారేంటి అనుకోవచ్చు. కానీ ఆ విధంగానే ఉంది అటు దేశంలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ లోని పరిపాలన. నాడు బ్రిటీషు సేనలు కట్టిన కట్టడాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు, బ్రిటీషు సేనలు ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లోనే వైద్యసేవలు, ఆఖరికి బ్రిటీషు వాడు పెట్టిన పేర్లనే నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తూ.. వాటిని ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా మార్పు చేయలేదంటూ తప్పించుకుంటన్నారనే  ఒక ప్రశ్న మీ మెదడులో ఉద్బవించొచ్చు.  దానికి ప్రధాన ఉదాహరణ విశాఖలోని కేజిహెచ్(కింగ్ జార్జి ఆసుపత్రి), విక్టోరియా ఆసుపత్రి, రాణి చంద్రమణి దేవి ఆసుపత్రి, ఇక రైల్వే విషయానికొస్తే వాల్తేరు రైల్వే డివిజన్,  అదే ప్రాంతాల విషయాకొస్తే..ఆంతోని నగర్, ఓల్డ్ టౌన్, రీడింగ్ రూమ్, ఇంకా ఉమ్మడి విశాఖజిల్లాలోని చాలా ప్రాంతాల్లో బ్రిటీషు పరిపాలన కోసం నిర్మించిన భవనాలు, వదిలి వెళ్లిన పేర్లు, ఆ నాటి పాత విధానాలే నేటికీ రాష్ట్రప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి.

 నాటి నుంచి నేటి వరకూ వాటి పేర్లను కూడా మర్పు చేసే ప్రయత్నం చేయలేదు. అంతెందుకు..రెవిన్యూ పరిపాలనలో మండల స్థాయి అధికారి తహశీల్దార్ పోస్టు, జిల్లా కలెక్టర్ పోస్టు, దఫేదార్, కూడా బ్రిటీషు కాలం నాటి పోస్టులే, సైన్యంలోని మేజర్ లాంటి పోస్టులన్నీ కూడా నాటి బ్రిటీషు ప్రభుత్వం నుంచీ ఉన్నవే. నాటి నుంచి నేటి వరకూ ఎందులోనూ మార్పు రాలేదు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఇక్కడ నాటి బ్రిటీషు ప్రభుత్వాన్ని కాదని నేటి ప్రభుత్వాలు ఏమీ చేయలేనరుకోవాలా..? లేదంటే ఆ బ్రిటీషు వాడి పేర్లే బాగున్నాయని వదిలేయాలనుకుంటున్నారా అనే ప్రశ్నలకు 75ఏళ్లుగా ఎలాంటి సమాధానాలు లేవు. ఉదా హరణకు కేజిహెచ్ అంటే అందరికీ తెలుసు గానీ.. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని, జిజిహెచ్(గవర్నమెంట్ జనరల్ హాస్పిటిల్) అంటే నేటికీ ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ కారణంతోనే నాటి బ్రిటీషు వాడు పెట్టి, వినియోగించి స్వాతంత్ర్యం అనంతరం వదిలి వెళ్లినా నాటి నుంచి నేటి వరకూ ఎలాంటి మార్పులు చేయలేకపోయాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల కలెక్టరేట్లన్నీ నాడు బ్రిటీషువాడు నిర్మించినవే. కొత్త జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ ఒక్క కలెక్టరేట్ కూడా నిర్మించలేకపోయాయి. అంటే ఇక్కడ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకి కలెక్టర్ లకు కలెక్టరేట్లు నిర్మించలేకపోతున్నాయి. కానీ చాలా ప్రాంతాల్లోని భవనాలు, కలెక్టరేట్లు ఇప్పటికీ సజీవంగా.. చెక్కు చెదరకుండా ఉండటంతో వాటినే వినియోగిస్తున్నాయి ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం నిర్మించిన భవనాలకు, ఆస్తులకు, సంస్థలకు రాజకీయ రంగు పులిమి ఎవరు అధికారంలోకి వస్తే వారి వాని నాయకుల పేర్లను మార్పులు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి తప్పితే బ్రిటీషువాడు పెట్టిన పేర్లను నేటికీ మార్పు చేసే దైర్యం చేయలేకపోతున్నాయి. అంటే ఇక్కడ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నేటికీ బ్రిటీషువాడి పరిపాలనకు భయపుడుతున్నాయనే చెప్పుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా నాటి కట్టడాలన్నీ చారిత్రకమైనవి.. పర్యాటకపరంగా ఆయా ప్రాంతాలకు గుర్తింపు ఇస్తున్నాయి అనుకుంటే.. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు కూడా దేశంలోని రాష్ట్రప్రభుత్వాలు ఆ ప్రదేశంలో ఉన్న స్థలాల్లో ఒకటి అరా భవనాల నిర్మాణాలు చేపట్టడం తప్పితే.. 

అప్పటి బ్రిటీషు వాడు నిర్మించిన స్థాయిలో ఏ  ప్రభుత్వ భవనం నిర్మించే లేకపోయాయంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు అంటూ ఊదరగొట్టి ఎక్కడా ఒక్క ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కూడా నిర్మించకపోయింది. కనీసం ప్రభుత్వ రంగ సంస్థలకు సదరు బ్రిటీషువాడి పేర్లను కూడా తొలగించలేకపోయాయి. కానీ రాష్ట్రప్రభుత్వ సంస్థలకు ఆయా దివంతగత నాయకుల పేర్లు, అక్కడ వారి ఫోటోలు, విగ్రహాలు పెట్టడానికి మాత్రం పోటీ పడి ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ వచ్చాయి. ఈ లెక్కన చూసినా బ్రిటీషు వాడంటే ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి భయం అలానే ఉండిపోయింది కనుక నాటి పేర్లను నేటికీ మార్చడానికి సాహసం చేయలేకపోతున్నారనేది స్పష్టమపోయింది. అవునా.. కాదా..? ఇలా అంటే మాత్రం అవునని అంటారు కానీ.. మళ్లీ పనిచేస్తున్న రాజకీయపార్టీల పదవులు అడ్డొచ్చి కాదు కాదు అంటారు..అలాగని ఎందుకు బ్రిటీషువాడి పేర్లను ఇంకా జపించాల్సి వస్తుందటే మాత్రం ఆ ఒక్కటీ అడక్కూ అంటున్నారు..!