పరివర్తనతో యువత మత్తు వదలండి..


Ens Balu
4
Yeleswaram
2021-11-12 14:36:21

యువత మంచి ఆలోచనతో మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని ఏలేశ్వరం ఎస్ఐ సిహెచ్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన పరివర్త కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత మత్తుకు బానిసలైతే విలువైన మంచి జీవితం నాశనం అవుతుందన్నారు. అదే సమయాన్ని విద్యోన్నతి కోసం శ్రమిస్తే మంచి భవిష్యత్తు దక్కుతుందని సూచించారు. అంతేకాకుండా మత్తుకు చేరవయ్యేవారిని, మత్తు పదార్ధాలు అమ్మేవారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చక్ర రెడ్డి, రవీంద్ర ,పండు దొర సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు