జిల్లాలో భూ కబ్జాలను, రికార్డుల ట్యాంపరింగ్ లను సహించేంది లేదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా గత 12ఏళ్లుగా తన భూమి సమస్యపై అధికారుల చుట్టూ తిరిగినా, సిట్ కి ఫిర్యాదు చేసినా, ఆఖరి సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శికి విశాఖ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసినా తన భూమి రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జా సమస్య తీరలేదని వల్లభదాసు కనక మహేష్ సురేంద్రకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా తన సమస్య పరిష్కారం కాలేదని..తన భూమి కబ్జాకి గురైందని.. రికార్డులు ట్యాంపరింగ్ చేశారని ఫిర్యాదు చేస్తే.. భూమిగి కబ్జా చేసిన వారిని వదిలేసి తనను భూమి రికార్డులు తీసుకు రమ్మంటున్నారని.. అలాగని తన వద్ద ఉన్న ప్రభుత్వ రికార్డులు తీసుకెళ్లి చూపించినా.. సమస్య ఉందని.. భూమి రికార్డులు ట్యాంపరింగ్ జరిగాయని చెబుతున్నారు తప్పితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకూ స్పందనలో ఎన్నేళ్లుగా దరఖాస్తులు పెట్టింది, తహశీల్దార్, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగింది పూర్తిగా ఆయనకు వివరించారు. పక్కగా భూమి రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్టుగా రికార్డుల్లోనే కనిపించినా ఈ సమస్యను అధికారులు పరిష్కరించకపోవడం వెనుక గల కారణాలను తెలుసుకుంటానని తప్పని సరిగా న్యాయం జరిగే చూస్తామని హామీ ఇచ్చారు. తాను హృద్రోగస్తుడనని.. తన ఆర్ధిక ఇబ్బందులు, సమస్యలు, భూమి కబ్జాకి గురైందని, రికార్డులు తారు మారు చేశారని ఎంత చెప్పినా.. రికార్డులు తారుమారు చేసిన వారిపై విచారణ చేయడం లేదని.. ఈ సమస్య పరిష్కారం కాకపోతే తనకు ఆత్మహత్య తప్పా మరే ఇతర మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి అమ్మింది కొంతైతే.. కబ్జాచేసింది.. రికార్డులు తారు మారు చేసిందే ఎక్కువగా ఉందనే విషయాన్ని సురేంద్రకు బాధితుడు మహేష్ పూర్తిగా వివరించారు. బాధితుడి పిర్యాదు, దానికి అనుబంధ రికార్డుల నకళ్లు పరిశీలించిన ఆయన రికార్డుల్లోనే ట్యాంపరింగ్ జరిగినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాలు సహించేది లేదని. ఈ విషయంలో రికార్డులు ట్యాంపరింగ్ చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రశక్తి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ఈ సందర్భంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే బాధితుడు కోల్పోయిన భూములను పరిశీలిస్తామని, రికార్డులు ఎక్కడ ట్యాంపరింగ్ జరిగాయో తెలుసుకొని సంబంధి అధికారులపై కూడా విచారణ చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 82 వ టీడీపీ ఇంచార్జ్ పోలవరపు త్రినాథ్,తలారి కాసినాయుడు,పైలా గోపి,మేడిశెట్టి నూకరాజు,కోన శ్రీను,కాండ్రేగుల చిన్న,తదితరులు పాల్గొన్నారు.